అడ్వకేట్ జనరల్ని మర్యాదపూర్వకంగా కలిసిన భాగ్యనగర్ వెల్ఫేర్ అసోసియేషన్..!
By Ravi
On
తెలంగాణ రాష్ట్ర హైకోర్టులో అడ్వకేట్ జనరల్ సుదర్శన్ రెడ్డిని మరియు అడ్వకేట్ సీహెచ్ శివకృష్ణని భాగ్యనగర్ వెల్ఫేర్ అసోసియేషన్స్ అధ్యక్షులు శ్రీనివాస్ మర్యాదపూర్వకంగా కలిశారు. రంగారెడ్డి జిల్లా మహంకాళి డబుల్ బెడ్ రూమ్ విషయంపై ఈ సందర్భంగా చర్చించారు. గత నెల 26న వాదనలు పూర్తి కావడంతో.. న్యాయమూర్తి జడ్జిమెంట్ను రిజర్వ్ చేశారు. ఈరోజు భాగ్యనగర్ వెల్ఫేర్ అసోసియేషన్స్ అధ్యక్షులు శ్రీనివాస్ ఆధ్వర్యంలో అడ్వకేట్ జనరల్తోపాటు అడ్వకేట్ శివకృష్ణని కలిసి ఈ విషయంపై చర్చించడం జరిగింది. కాగా అతి తొందరగా జడ్జిమెంట్ వచ్చేలాగా కృషి చేస్తామని హామీ ఇచ్చారని సభ్యులు తెలిపారు.
Latest News
04 May 2025 21:40:13
రాచకొండ కమిషనరేట్ బాలాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో కిడ్నాప్ కలకలం రేగింది. కిరాణ షాప్ నడుపుకునే ఆజం (25) అనే యువకుడిని గుర్తుతెలియని దుండగులు బలవంతంగా తీసుకు...