నేడు చెన్నై, లక్నో కు మధ్య మ్యాచ్ టఫ్ కానుందా?

By Ravi
On
నేడు చెన్నై, లక్నో కు మధ్య మ్యాచ్ టఫ్ కానుందా?

ఐపీఎల్ 2025లో భాగంగా ఈరోజు మ్యాచ్ లక్నో వర్సెస్ చెన్నై కి మధ్య జరగనుంది. ఈ సీజన్‌లో లక్నో జట్టు లీగ్ దశలో చెన్నైతో ఒకే ఒక్క మ్యాచ్ ఆడనుంది. కాబట్టి రెండు జట్ల అభిమానులు ఈ మ్యాచ్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మెగా ఈవెంట్‌లో లక్నో ప్రదర్శన ఇప్పటివరకు అట్రాక్ట్ చేసింది. లక్నో జట్టు గత మూడు మ్యాచుల్లో అద్భుతమైన విజయాలు సాధించింది. మరోవైపు, చెన్నై సూపర్ కింగ్స్ గత ఐదు మ్యాచుల్లో ఫెయిల్యూర్స్ ను ఎదుర్కొంది. ఇటువంటి పరిస్థితిలో ప్లేఆఫ్ రేసులో కొనసాగాలంటే చెన్నై ఏ విధంగానైనా గెలవాల్సిందే అని ప్రేక్షకులు కోరుకుంటున్నారు.

రిషబ్ పంత్ నేతృత్వంలోని లక్నో జట్టు గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన చివరి మ్యాచ్‌లో అద్భుతంగా రాణించి, మూడు బంతులు మిగిలి ఉండగానే 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. అదే సమయంలో, చెన్నై గత సీజన్ విజేత కోల్‌కతా నైట్ రైడర్స్‌తో తన చివరి మ్యాచ్ ఆడింది. ఈ మ్యాచ్‌లో చెన్నై తన సొంత మైదానంలో 8 వికెట్ల తేడాతో ఓడిపోయింది. చెన్నై జట్టు బౌలింగ్, బ్యాటింగ్ విభాగాల్లో ఘోరంగా విఫలమైంది. చెన్నైని ఓడించడం ద్వారా పంత్ జట్టు టోర్నమెంట్‌లో తన విజయ పరంపరను కొనసాగించడానికి ప్రయత్నిస్తుంది. మరి చెన్నై తిరిగి విజయాల ట్రాక్‌లోకి రావాలని కోరుకుంటుంది. మరి ఈ మ్యాచ్ లో ఎవరు విన్ అవుతారో చూడాలి.

Advertisement

Latest News

విజయ్ దేవరకొండ రిలీజ్ డేట్ కి పవన్ కళ్యాణ్? విజయ్ దేవరకొండ రిలీజ్ డేట్ కి పవన్ కళ్యాణ్?
ప్రజంట్ మన టాలీవుడ్ నుంచి రానున్న పలు భారీ సినిమాల్లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న అవైటెడ్ సినిమా హరిహర వీరమల్లు కూడా ఒకటి. మరి...
కోలీవుడ్ లో ఎంట్రీ ఇవ్వనున్న యాక్టర్ సుహాస్..
ఎన్టీఆర్, నీల్ టైటిల్ అండ్ ఫస్ట్ లుక్ ఎప్పుడంటే..?
ఎల‌క్ట్రానిక్ వ్య‌ర్ధాల‌తో పిల్ల‌లు, గ‌ర్భిణీల‌కు ప్ర‌మాదం..!
బారువా బీచ్ ఫెస్టివల్‌ని ప్రారంభించిన కేంద్రమంత్రి రామ్మోహన్‌నాయుడు..!
పశ్చిమ్‌బెంగాల్‌లో రాష్ట్రపతి పాలన విధించాలి : వీహెచ్‌పీ
అక్రమ నిర్మాణాల కూల్చివేతపై హైడ్రాకు అభినందనలు..!