ఉద్యోగ, ఉపాధి కల్పనలో కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాలు విఫలం: ఏఐవైఎఫ్ నేతలు ఆందోళన

By Ravi
On
ఉద్యోగ, ఉపాధి కల్పనలో కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాలు విఫలం: ఏఐవైఎఫ్ నేతలు ఆందోళన

WhatsApp Image 2025-03-28 at 12.04.49 PM

నరసన్నపేట, 28/03/2025

ఏఐవైఎఫ్ (ఆల్ ఇండియా యువ జన ఫెడరేషన్) 17వ జాతీయ మహాసభలలోగో శుక్రవారం నరసన్నపేట పట్టణంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా, ఏఐవైఎఫ్ నేతలు, రాష్ట్ర అధ్యక్షుడు మొజ్జాడ యుగంధర్, జిల్లా అధ్యక్షులు బొత్స సంతోష్, కొన్న శ్రీనివాసరావు, సమగ్ర యువజన విధానం అమలులో విఫలమైన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను తీవ్రంగా విమర్శించారు.

"ప్రతి సంవత్సరం 2 కోట్లు ఉద్యోగాలు అందించాలన్న ప్రభుత్వ ప్రతిజ్ఞ అమలులో లేదు, దీంతో దేశంలో నిరుద్యోగం మరింత పెరుగుతోంది. మత రాజకీయాలు పెంచి యువతకు ఉపాధి అవకాశాలపై దృష్టి పెట్టడం లేదు" అని వారు అన్నారు.

ఈ సందర్భంగా, ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణను నిలిపివేసి, యువతకు ఉపాధి కల్పించేందుకు భగత్ సింగ్ నేషనల్ ఎంప్లాయిమెంట్ గ్యారంటీ యాక్ట్ అమలు చేయాలని డిమాండ్ చేశారు.

"ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్లు కల్పించాలని, నిరుద్యోగులకు ఆదుకోవాలని" ఏఐవైఎఫ్ నాయకులు సూచించారు.

ఈ కార్యక్రమంలో, 2025లో మే 15-18 తేదీల మధ్య తిరుపతిలో నిర్వహించే 17వ జాతీయ మహాసభలకు దేశవ్యాప్తంగా వెయ్యి మంది ప్రతినిధులు హాజరవుతారని, ఆవకాశాల కోసం నిరుద్యోగులతో ప్రదర్శన కూడా నిర్వహిస్తామని వెల్లడించారు.

ఈ సమావేశంలో ఏఐవైఎఫ్ నాయకులు అరవింద్, వసంత్, వాసు, క్రాంతి తదితరులు పాల్గొన్నారు.

Tags:

Advertisement

Latest News

హఠాత్తుగా మూతపడిన జిందాల్ పరిశ్రమ..! ఆందోళన బాటలో కార్మికులు..!! హఠాత్తుగా మూతపడిన జిందాల్ పరిశ్రమ..! ఆందోళన బాటలో కార్మికులు..!!
విజయనగరం TPN : కొత్తవలస మండలంలోని అప్పన్నపాలెం దగ్గరున్న జిందాల్ స్టెయిన్ లెస్ స్టీల్ పరిశ్రమ దశాబ్దాలుగా నడుస్తూ వందలాది మంది కార్మికులకు జీవనోపాధిగా నిలిచింది. అయితే...
టీజీఎస్ఆర్టీసీ ఆస్పత్రిలో క్యాథ్ ల్యాబ్, 12 బెడ్ల ఎమ‌ర్జెన్సీ కేర్ యూనిట్..!
దోమల వ్యాప్తి నిర్మూలనలో డ్రైడే పద్ధతి ఉత్తమం :. డాక్టర్ జగన్‌మోహన్‌రావు
అంజన్‌కుమార్‌యాదవ్‌ వ్యాఖ్యలకు నిరసనగా బీజేపీ నేతల ధర్నా..!
మే 7 నుంచి ద్వారకా తిరుమలేశుని కల్యాణోత్సవాలు..!
కాచిగూడ రైల్వే మ్యూజియంలో ఘనంగా వరల్డ్ హెరిటేజ్ డే..!
హైదరాబాద్‌ సిటీలో అర్ధరాత్రి దొంగల హల్‌చల్‌..!