నగరంలో పలుచోట్ల ఎక్సైజ్ దాడులు.. డ్రగ్స్ అండ్ గంజాయి స్వాదీనం

By Ravi
On
నగరంలో పలుచోట్ల ఎక్సైజ్ దాడులు.. డ్రగ్స్ అండ్  గంజాయి స్వాదీనం

WhatsApp Image 2025-03-27 at 3.47.33 PMహైదరాబాద్: ఎస్టి‌ఎఫ్ బీ టీమ్‌ రెండు వేర్వేరు కేసుల్లో 2.78 గ్రాముల ఎండిఎంఎ డ్రగ్స్‌ మరియు 1.302 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకుంది. ఈ కేసుల్లో ఐదుగురిని అరెస్టు చేసిన అధికారులు, ఆరుగురు పరారీలో ఉన్నారని తెలిపారు.

Screenshot 2025-03-27 185645
డ్రగ్స్ పట్టివేత:
ఎర్రగడ్డ మెట్రో స్టేషన్‌ సమీపంలో డ్రగ్స్‌ అమ్మకాలు జరగుతున్నట్లు సమాచారం అందుకున్న ఎస్టిఎఫ్ బీ టీమ్‌ సీఐ బిక్షారెడ్డి నేతృత్వంలో దాడులు నిర్వహించి 2.78 గ్రాముల ఎండిఎంఎ డ్రగ్స్‌ను పట్టుకున్నారు. ఈ దాడిలో ఎస్‌కె మహ్మమద్‌ రహీమ్‌, మహ్మమద్‌ ఫక్రుద్దీన్‌ను అరెస్టు చేశారు.

ఈ కేసులో సౌదీ అరేబియాకు చెందిన సఫాన్ మరియు బెంగుళూరుకు చెందిన ఇబ్రహీమ్‌ జహీర్‌ అనే వ్యక్తులు పరారీలో ఉన్నట్లు గుర్తించి వారిపై కేసు నమోదు చేశారు.

గంజాయి పట్టివేత: ఇంతలో, లోయర్ ధూల్‌పేట్‌ జుంగూర్‌ బస్తీలో గంజాయి అమ్మకాలు జరుగుతున్నట్లు సమాచారం అందుకున్న ఎస్టిఎఫ్ బీ టీమ్‌, ఎక్సైజ్ పోలీసులు దాడులు నిర్వహించి 1.302 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో కునాల్‌ సింగ్‌, వినోద్‌ సింగ్‌, హేమబాయ్‌లను అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి నాలుగు మొబైల్ ఫోన్లు మరియు యాక్టివా హోండ వాహనాన్ని సీజ్‌ చేశారు.

ఈ కేసులో అనికేష్‌ సింగ్‌, అర్తిబాయ్‌, సరేన్‌, గణేష్‌ సింగ్‌లు పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు.

అభినందనలు: ఈ రెండు కేసుల్లో ఎస్టిఎఫ్ టీమ్‌ను ఎన్‌ఫోర్స్ మెంట్ డైరెక్టర్ వి.బి.కమలాసన్‌రెడ్డి, ఎస్‌టి‌ఎఫ్ బీ టీమ్‌ టీడర్‌ ప్రదీప్‌రావులు అభినందించారు.

సీఐ బిక్షారెడ్డి, ఎస్సైలు బాలరాజు, సంద్యా, కానిస్టేబుళ్లు యాదగిరి, అనీఫ్, నితిన్‌, మహేశ్వర్‌, కౌశిక్‌, శ్రీనివాసరెడ్డి ఈ దర్యాప్తులో భాగంగా పాల్గొన్నారు.

Tags:

Advertisement

Latest News

హఠాత్తుగా మూతపడిన జిందాల్ పరిశ్రమ..! ఆందోళన బాటలో కార్మికులు..!! హఠాత్తుగా మూతపడిన జిందాల్ పరిశ్రమ..! ఆందోళన బాటలో కార్మికులు..!!
విజయనగరం TPN : కొత్తవలస మండలంలోని అప్పన్నపాలెం దగ్గరున్న జిందాల్ స్టెయిన్ లెస్ స్టీల్ పరిశ్రమ దశాబ్దాలుగా నడుస్తూ వందలాది మంది కార్మికులకు జీవనోపాధిగా నిలిచింది. అయితే...
టీజీఎస్ఆర్టీసీ ఆస్పత్రిలో క్యాథ్ ల్యాబ్, 12 బెడ్ల ఎమ‌ర్జెన్సీ కేర్ యూనిట్..!
దోమల వ్యాప్తి నిర్మూలనలో డ్రైడే పద్ధతి ఉత్తమం :. డాక్టర్ జగన్‌మోహన్‌రావు
అంజన్‌కుమార్‌యాదవ్‌ వ్యాఖ్యలకు నిరసనగా బీజేపీ నేతల ధర్నా..!
మే 7 నుంచి ద్వారకా తిరుమలేశుని కల్యాణోత్సవాలు..!
కాచిగూడ రైల్వే మ్యూజియంలో ఘనంగా వరల్డ్ హెరిటేజ్ డే..!
హైదరాబాద్‌ సిటీలో అర్ధరాత్రి దొంగల హల్‌చల్‌..!