మరీ ఇంత పిచ్చి పనికి రాదు బ్రో..

By Ravi
On
మరీ ఇంత పిచ్చి పనికి రాదు బ్రో..

తాండూరు: ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్ అంటే సోషల్ మీడియాలో ఫ్యాన్స్ వార్ కొనసాగడం సహజమే. కానీ వికారాబాద్ జిల్లా తాండూరు ప్రాంతానికి చెందిన ఓ యువకుడు ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ పంజాబ్ vs ఆర్సీబి మ్యాచ్ లో ఆర్సీబి గెలుపొంది ఫైనల్ కప్ కొడితే, తాండూరు బస్ స్టాండ్ లో అరగుండు కొట్టుకొని, మెడలో చెప్పుల దండవేసుకొని తిరిగుతానని ఓ వీడియోని ఇన్ స్టా లో పోస్ట్ చేశాడు. దింతో పలువురు ఇన్స్టాగ్రామ్ యూజర్లు ఛాలెంజ్ యాక్సెప్టెడ్ అంటూ కామెంట్ లు చేశారు. సెమి ఫైనల్ మ్యాచ్ లో కూడా ముంబై ఇండియన్స్ vs పంజాబ్ మ్యాచ్ లో పంజాబ్ గెలుపొందితే తాండూరు పట్టణ చౌరస్తాలో తన షర్టు విప్పుకొని తిరుగుతానని ఛాలెంజ్ చేశాడు. ఛాలెంజ్ ప్రకారం పంజాబ్ టీం గెలవడంతో ఆ యువకుడు తాండూరు పట్టణ చౌరస్తాలో షర్ట్ విప్పుకొని తిరుగుతూ ఓ వీడియోని తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఇదే తరహాలో ఫైనల్ మ్యాచ్ పంజాబ్ vs ఆర్సిబి మ్యాచ్ లో ఆర్సిబి ఫైనల్ కప్పు కొడితే తాండూర్ బస్టాండ్ లో అరగుండు కొట్టుకొని, మెడలో చెప్పుల దండ వేసుకొని తిరుగుతానని చేసిన చాలెంజ్ పై ఇంస్టాగ్రామ్ యూజర్లు కామెంట్ ద్వారా ఆ వీడియోని చూసేందుకు ఆర్సిబి విన్, చాలెంజ్ కి సిద్ధంగా ఉండు అని ఆర్సిబి ఫాన్స్ సవాల్ చేశారు.

చివరికి ఛాలెంజ్ యాక్సెప్టెడ్ అంటూ ఆ యువకుడు తాండూరు బస్ స్టాండ్ లో అర గుండుతో మెడలో చెప్పుల దండ వేసుకొని వీడియో ని ఇన్స్టాగ్రామ్ లో  పోస్ట్ చేశాడు. ప్రస్తుతం ఈ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

Advertisement

Latest News

మహిళ ఎస్ఐ పై దాడి కేసు.. 7గురు అరెస్ట్.. మహిళ ఎస్ఐ పై దాడి కేసు.. 7గురు అరెస్ట్..
ఖమ్మం: మహిళ ఎస్సైపై దాడి చేసిన కేసులో ఏడుగురుని అరెస్ట్ చేశారు. విధినిరవహణలో వున్న కల్లూరు పోలీస్ స్టేషన్ మహిళ ఎస్సై హరిత తో దురుసుగా ప్రవర్తించిన...
దంపతుల గొడవ మధ్యలో సర్ది చెప్పేందుకు వెళ్లింది...
సెల్ ఫోన్ పేలి యువకుడు మృతి..?
ఆదివారం ఉదయం 10గంటల నుండి ప్రారంభం..
హైదరాబాద్‌లో చేప ప్రసాదం 2025: తేదీలు ఖరారు
మీరాలం ఈద్గాలో ప్రత్యేక ప్రార్థనలు.. హాజరైన ముస్లిం సోదరులు..
సారుకు ఫోనే లోకమాయే...ప్రజా సమస్యలు పట్టవాయే..