సురానా గ్రూప్ ఆఫ్ కంపెనీస్పై ఈడీ దాడులు..!
By Ravi
On
సురానా గ్రూప్ ఆఫ్ కంపెనీస్ చైర్మన్ నరేందర్ సురాన, ఎండీ దేవేందర్ సురానా ఇళ్లల్లో, ఈడీ అధికారులు సోదాలు నిర్వహించారు. మనీలాండరింగ్తోపాటు విదేశాలకు డబ్బులు తరలించినట్లు ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో ఈడీ దాడులు చేసింది. హైదరాబాద్ బోయిన్పల్లి అరియాంత్ కార్డ్ మాస్టర్ ఎంక్లేవ్లోని విల్లాల్లో ఈడీ బృందం సోదాలు జరిపింది. రెండు నెలల క్రితం కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేసిన ఈడీ.. ఈ రోజు తెల్లవారుజామున నాలుగు గంటలకి దాడులు నిర్వహించింది. మొత్తం రెండు టీములతో సోదాలు నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది.
Related Posts
Latest News
18 Apr 2025 21:42:20
విజయనగరం TPN : కొత్తవలస మండలంలోని అప్పన్నపాలెం దగ్గరున్న జిందాల్ స్టెయిన్ లెస్ స్టీల్ పరిశ్రమ దశాబ్దాలుగా నడుస్తూ వందలాది మంది కార్మికులకు జీవనోపాధిగా నిలిచింది. అయితే...