3 దశాబ్దాల కలని సాకారం చేసిన ఎమ్మెల్యే ఎంజీఆర్‌..!

By Ravi
On
3 దశాబ్దాల కలని సాకారం చేసిన ఎమ్మెల్యే ఎంజీఆర్‌..!

మూడు దశాబ్దాల ప్రజల కలను ఎమ్మెల్యే మామిడి గోవిందరావు సాకారం చేశారు. రూ.3.05 కోట్లతో ప్రతిష్టాత్మకమైన చంగుడి, సరాలి, మాకనాపల్లి రహదారికి శంకుస్థాపన చేశారు. 30 ఏళ్లుగా పాతపట్నం మండలం, అచ్యుతాపురం, అంతరాభ, చంగుడి, సరాలి, అప్పోజిపేట, మాకనాపల్లి గ్రామాలకు సరైన రహదారి సౌకర్యం లేకపోవడంతో ప్రయాణానికి తీవ్ర ఇబ్బందులు పడుతున్న విషయం తెలుసుకుని.. గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలో భాగంగా పీఆర్ నిధులతో బీటీ రహదారి నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈ రహదారి నిర్మాణంతో 6 గ్రామాల ప్రజల ప్రయాణ కష్టాలు తీరనున్నాయి. అలాగే ఇచ్చిన హామీని 10 నెలల్లోపే నిలబెట్టుకున్నందుకు.. ఆ గ్రామాల ప్రజలు ఎమ్మెల్యేకి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఘన స్వాగతం పలికారు. శంకుస్థాపన అనంతరం ఎంజీఆర్‌ మాట్లాడుతూ.. పాతపట్నం నియోజకవర్గం అభివృద్ధికై కట్టుబడి ఉన్నానని.. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన పది నెలల్లోనే సుమారు రూ. 450 కోట్ల నిధులు పాతపట్నం నియోజకవర్గం అభివృద్ధికై కేటాయించిందని తెలిపారు. పాతపట్నం చరిత్రలో మునుపెన్నడూ లేని విధంగా ప్రతీ గ్రామానికీ రహదారి నిర్మిస్తామని.. డోలీ మోత లేని గిరిజన గ్రామాలుగా తీర్చిదిద్దడమే తన లక్ష్యమన్నారు. ఈ కార్యక్రమంలో అధికారులు, కూటమి పార్టీల నాయకులు, కార్యకర్తలు, అభిమానులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.

Advertisement

Latest News

హఠాత్తుగా మూతపడిన జిందాల్ పరిశ్రమ..! ఆందోళన బాటలో కార్మికులు..!! హఠాత్తుగా మూతపడిన జిందాల్ పరిశ్రమ..! ఆందోళన బాటలో కార్మికులు..!!
విజయనగరం TPN : కొత్తవలస మండలంలోని అప్పన్నపాలెం దగ్గరున్న జిందాల్ స్టెయిన్ లెస్ స్టీల్ పరిశ్రమ దశాబ్దాలుగా నడుస్తూ వందలాది మంది కార్మికులకు జీవనోపాధిగా నిలిచింది. అయితే...
టీజీఎస్ఆర్టీసీ ఆస్పత్రిలో క్యాథ్ ల్యాబ్, 12 బెడ్ల ఎమ‌ర్జెన్సీ కేర్ యూనిట్..!
దోమల వ్యాప్తి నిర్మూలనలో డ్రైడే పద్ధతి ఉత్తమం :. డాక్టర్ జగన్‌మోహన్‌రావు
అంజన్‌కుమార్‌యాదవ్‌ వ్యాఖ్యలకు నిరసనగా బీజేపీ నేతల ధర్నా..!
మే 7 నుంచి ద్వారకా తిరుమలేశుని కల్యాణోత్సవాలు..!
కాచిగూడ రైల్వే మ్యూజియంలో ఘనంగా వరల్డ్ హెరిటేజ్ డే..!
హైదరాబాద్‌ సిటీలో అర్ధరాత్రి దొంగల హల్‌చల్‌..!