వైద్యుల నిర్లక్ష్యానికి నిండు ప్రాణం బలి..!
By Ravi
On
హైదరాబాద్ లంగర్హౌస్ పోలీస్ స్టేషన్ పరిధిలో హై కేర్ హాస్పిటల్లో వైద్యుల నిర్లక్ష్యానికి నిండు ప్రాణం బలైంది. కార్వాన్ భాంజావాడిలో ఉండే ఎల్లయ్య ఆయాసంగా ఉందని లంగర్ హౌస్ హై కేర్ హాస్పిటల్కి చెక్ అప్ కోసం వచ్చాడు. అక్కడి వైద్యులు ఈసీజీ చేసిన తర్వాత ఎలాంటి ప్రమాదం లేదని.. 24 గంటలు అబ్జర్వేషన్లో పెట్టాలని కుటుంబ సభ్యులకు తెలిపారు. కాసేపు గడిచాక ఎల్లయ్య ఆరోగ్యం మరింత క్షీణించడంతో.. తమ వద్ద కార్డియో స్పెషలిస్ట్ లేడని వెంటనే తీసుకుపోవాలని బంధువులకు చెప్పారు. అంతలోనే ఎల్లయ్య మృతిచెందడంతో.. హాస్పిటల్ ఎదుట పెద్ద ఎత్తున చేరిన మృతుడి బంధువులు ధర్నా నిర్వహించారు.
Related Posts
Latest News
18 Apr 2025 21:42:20
విజయనగరం TPN : కొత్తవలస మండలంలోని అప్పన్నపాలెం దగ్గరున్న జిందాల్ స్టెయిన్ లెస్ స్టీల్ పరిశ్రమ దశాబ్దాలుగా నడుస్తూ వందలాది మంది కార్మికులకు జీవనోపాధిగా నిలిచింది. అయితే...