ఢిల్లీ ఎయిర్ పోర్ట్ లో బంగారం స్మగ్లింగ్..

By Ravi
On
ఢిల్లీ ఎయిర్ పోర్ట్ లో బంగారం స్మగ్లింగ్..

నేషనల్ లెవెల్ లో బంగారం స్మగ్లింగ్ జరుగుతుంది. గోల్డ్ స్మగ్లర్లు ఎలాంటి భయం లేకుండా బంగారం అక్రమ రవాణా చేస్తున్నారు. ఎయిర్ పోర్టుల్లో అధికారులకు మస్కా కొట్టి మరీ బంగారాన్ని ట్రాన్ఫర్ చేస్తున్నారు. ఇంటర్నేషనల్ విమానాశ్రయాలు, ఓడరేవుల్లో చాలాసార్లు బంగారం పట్టుబడిన సంఘటనలు ఎన్నో నిత్యం జరుగుతునే ఉన్నాయి. ఈ క్రమంలో తాజాగా దేశ రాజధాని ఢిల్లీలోని ఇందిరా గాంధీ నేషనల్ ఎయిర్ పోర్ట్ లో కస్టమ్స్ డిపార్ట్ మెంట్ లో భారీగా బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. కాగా ఓ ఇరాక్ యువకుడి దగ్గర నుండి 1.2 కిలోల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. 

అయితే కస్టమ్స్ డిపార్ట్ మెంట్ ఎయిర్ ఇంటెలిజెన్స్ యూనిట్ అధికారులు ఇండిగో విమానం ద్వారా బాగ్దాద్ నుండి ఢిల్లీకి చేరుకున్న ఇరాకీ ప్రయాణికుడిని ఆపారు. ప్రయాణికుల లగేజీని ఎక్స్ రే స్క్రీనింగ్ చేస్తున్నప్పుడు అనుమానాస్పద ఫోటోలు గుర్తించబడ్డాయి. తర్వాత ఆ ప్రయాణికుడిని డోర్ ఫ్రేమ్ మెటల్ డిటెక్టర్ తో తనిఖీ చేసినప్పుడు.. అతని లగేజీ నుండి రకరకాల గోల్డ్ కలర్ లోహపు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నాయి. కాగా వీటి మొత్తం బరువు 1203 గ్రాములు గుర్తించారు. స్వాధీనం చేసుకున్న బంగారం స్వచ్ఛత, విలువను తెలియజేయడానికి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Tags:

Advertisement

Latest News

హఠాత్తుగా మూతపడిన జిందాల్ పరిశ్రమ..! ఆందోళన బాటలో కార్మికులు..!! హఠాత్తుగా మూతపడిన జిందాల్ పరిశ్రమ..! ఆందోళన బాటలో కార్మికులు..!!
విజయనగరం TPN : కొత్తవలస మండలంలోని అప్పన్నపాలెం దగ్గరున్న జిందాల్ స్టెయిన్ లెస్ స్టీల్ పరిశ్రమ దశాబ్దాలుగా నడుస్తూ వందలాది మంది కార్మికులకు జీవనోపాధిగా నిలిచింది. అయితే...
టీజీఎస్ఆర్టీసీ ఆస్పత్రిలో క్యాథ్ ల్యాబ్, 12 బెడ్ల ఎమ‌ర్జెన్సీ కేర్ యూనిట్..!
దోమల వ్యాప్తి నిర్మూలనలో డ్రైడే పద్ధతి ఉత్తమం :. డాక్టర్ జగన్‌మోహన్‌రావు
అంజన్‌కుమార్‌యాదవ్‌ వ్యాఖ్యలకు నిరసనగా బీజేపీ నేతల ధర్నా..!
మే 7 నుంచి ద్వారకా తిరుమలేశుని కల్యాణోత్సవాలు..!
కాచిగూడ రైల్వే మ్యూజియంలో ఘనంగా వరల్డ్ హెరిటేజ్ డే..!
హైదరాబాద్‌ సిటీలో అర్ధరాత్రి దొంగల హల్‌చల్‌..!