చైనా వాణిజ్యంపై కేంద్ర మంత్రి వ్యాఖ్యలు..

By Ravi
On
చైనా వాణిజ్యంపై కేంద్ర మంత్రి వ్యాఖ్యలు..

చైనా వాణిజ్య పద్ధతులపై కేంద్ర వాణిజ్య శాఖా మంత్రి పీయూష్ గోయల్ తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. చైనా ఉపయోగించే అన్యాయమైన వాణిజ్య పద్ధతులను తమ ఆర్థిక వృద్ధికి కారణమవుతుందని అన్నారు. ధరలు, సబ్సిడీలు, కార్మికుల రూల్స్ ఇవన్నీ బీజింగ్ అభివృద్ధికి కారణమవుతున్నాయని అన్నారు. ప్రపంచ వాణిజ్యంలో చైనా తమ ఆధిపత్యాన్ని పెంచుతుందని.. ఇది భారత్ లాంటి దేశాల ఆర్ధిక వ్యవస్థలపై అధిక ప్రభావం చూపిస్తుందని అన్నారు. కాబట్టి వెంటనే వీటిపై పరిష్కార మార్గం చూడకపోతే ఖచ్చితంగా ప్రపంచ దేశాలు తీవ్ర ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కోవాల్సిన పరిస్థితి వస్తుందని పేర్కోన్నారు. 

ఇక ప్రపంచ వాణిజ్య నిబంధనల్లో సైతం మార్పులు చేర్పులు చేయాల్సిన పరిస్థితి వచ్చిందని అన్నారు. మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్ పేయీ కాలంలో భారత్, చైనాల మధ్య వాణిజ్య లోటు సాధారణంగా ఉందని, గత యూపీఏ ప్రభుత్వంలోనే అది 25 రెట్లకు పెరిగిందని పీయూష్ ఆరోపించారు. అంతేకాకుండా చైనాతో రాహుల్ గాంధీకి ఒప్పందం ఉందని, అదే భారత్ లోకి వచ్చే చైనా ప్రొడక్ట్స్ పై సుంకాలు భారీగా తగ్గేలా చేశాయని అన్నారు. ఈ కారణంగానే భారత్, చైనాపై ఆధారపడేలా చేసిందని పీయూష్ గోయాల్ అన్నారు.

Tags:

Advertisement

Latest News

హఠాత్తుగా మూతపడిన జిందాల్ పరిశ్రమ..! ఆందోళన బాటలో కార్మికులు..!! హఠాత్తుగా మూతపడిన జిందాల్ పరిశ్రమ..! ఆందోళన బాటలో కార్మికులు..!!
విజయనగరం TPN : కొత్తవలస మండలంలోని అప్పన్నపాలెం దగ్గరున్న జిందాల్ స్టెయిన్ లెస్ స్టీల్ పరిశ్రమ దశాబ్దాలుగా నడుస్తూ వందలాది మంది కార్మికులకు జీవనోపాధిగా నిలిచింది. అయితే...
టీజీఎస్ఆర్టీసీ ఆస్పత్రిలో క్యాథ్ ల్యాబ్, 12 బెడ్ల ఎమ‌ర్జెన్సీ కేర్ యూనిట్..!
దోమల వ్యాప్తి నిర్మూలనలో డ్రైడే పద్ధతి ఉత్తమం :. డాక్టర్ జగన్‌మోహన్‌రావు
అంజన్‌కుమార్‌యాదవ్‌ వ్యాఖ్యలకు నిరసనగా బీజేపీ నేతల ధర్నా..!
మే 7 నుంచి ద్వారకా తిరుమలేశుని కల్యాణోత్సవాలు..!
కాచిగూడ రైల్వే మ్యూజియంలో ఘనంగా వరల్డ్ హెరిటేజ్ డే..!
హైదరాబాద్‌ సిటీలో అర్ధరాత్రి దొంగల హల్‌చల్‌..!