చైనా వాణిజ్యంపై కేంద్ర మంత్రి వ్యాఖ్యలు..
చైనా వాణిజ్య పద్ధతులపై కేంద్ర వాణిజ్య శాఖా మంత్రి పీయూష్ గోయల్ తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. చైనా ఉపయోగించే అన్యాయమైన వాణిజ్య పద్ధతులను తమ ఆర్థిక వృద్ధికి కారణమవుతుందని అన్నారు. ధరలు, సబ్సిడీలు, కార్మికుల రూల్స్ ఇవన్నీ బీజింగ్ అభివృద్ధికి కారణమవుతున్నాయని అన్నారు. ప్రపంచ వాణిజ్యంలో చైనా తమ ఆధిపత్యాన్ని పెంచుతుందని.. ఇది భారత్ లాంటి దేశాల ఆర్ధిక వ్యవస్థలపై అధిక ప్రభావం చూపిస్తుందని అన్నారు. కాబట్టి వెంటనే వీటిపై పరిష్కార మార్గం చూడకపోతే ఖచ్చితంగా ప్రపంచ దేశాలు తీవ్ర ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కోవాల్సిన పరిస్థితి వస్తుందని పేర్కోన్నారు.
ఇక ప్రపంచ వాణిజ్య నిబంధనల్లో సైతం మార్పులు చేర్పులు చేయాల్సిన పరిస్థితి వచ్చిందని అన్నారు. మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్ పేయీ కాలంలో భారత్, చైనాల మధ్య వాణిజ్య లోటు సాధారణంగా ఉందని, గత యూపీఏ ప్రభుత్వంలోనే అది 25 రెట్లకు పెరిగిందని పీయూష్ ఆరోపించారు. అంతేకాకుండా చైనాతో రాహుల్ గాంధీకి ఒప్పందం ఉందని, అదే భారత్ లోకి వచ్చే చైనా ప్రొడక్ట్స్ పై సుంకాలు భారీగా తగ్గేలా చేశాయని అన్నారు. ఈ కారణంగానే భారత్, చైనాపై ఆధారపడేలా చేసిందని పీయూష్ గోయాల్ అన్నారు.