మురారిలో పండగ వాతావరణం లో పల్లె పండుగ

By Ravi
On
మురారిలో పండగ వాతావరణం లో పల్లె పండుగ

కోటి యాభై లక్షల రూపాయలతో నిర్మించిన మెయిన్ రోడ్డు సిమెంట్ రోడ్డు సిసి డ్రైన్లు ప్రారంభించిన ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ

V.ananthkumar TNP
Jaggampeta

కాకినాడ జిల్లా గండేపల్లి ఏప్రిల్ 4: గండేపల్లి మండలం మురారి గ్రామంలో కూటమి ప్రభుత్వ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న పల్లె పండుగ కార్యక్రమాన్ని పండగ వాతావరణం లో మురారి గ్రామ ఉప సర్పంచ్ జాస్తి వసంత్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జగ్గంపేట శాసనసభ్యులు, టిటిడి బోర్డు మెంబర్ జ్యోతుల నెహ్రూ ముఖ్యఅతిథిగా హాజరై కోటి యాభై లక్షల రూపాయలతో నిర్మించిన సిమెంట్ రోడ్డు సిసి డ్రైన్లు ప్రారంభించారు. ముందుగా ఎన్టీఆర్, కందుల కొండయ్య దొర విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళి అర్పించారు. అనంతరం తమ స్కూల్ కి రోడ్లు వేయించినందుకు ఎమ్మెల్యే నెహ్రూకు స్కూల్ విద్యార్థిని విద్యార్థులు థాంక్యూ ఎమ్మెల్యే సార్ అనే పే కార్డులతో ఘన స్వాగతం పలికి కృతజ్ఞతలు తెలియజేశారు. అనంతరం ప్రభుత్వ అధికారులందరినీ ఘనంగా సత్కరించి జ్ఞాపికలు అందించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నెహ్రూ మాట్లాడుతూ కుటమి ప్రభుత్వం ఏర్పడిన పది నెలల కాలంలోనే 25 కోట్ల రూపాయలతో నియోజకవర్గంలో మొదటి విడతగా మిగిలి ఉన్న సిమెంట్ రోడ్లు వేయడం జరిగిందని అదేవిధంగా నియోజకవర్గం లోని బీటీ రోడ్లు కూడా నిర్మాణం జరుగుతున్నాయని రెండో సంవత్సరంలో సిమెంట్ డ్రైన్లు నిర్మించడానికి చర్యలు తీసుకుంటామని అన్నారు. అనంతరం గండేపల్లి, మల్లేపల్లి గ్రామాలలో పల్లె పండుగ కార్యక్రమంలో పాల్గొని పలు అభివృద్ధి పనులను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పోతుల మోహనరావు, కుంచె రాజా, కందుల చిట్టిబాబు, అడబాల భాస్కరరావు, జాస్తి వసంత్, సుంకవిల్లిరాజు, బొల్లం రెడ్డి రామకృష్ణ, సుంకవిల్లి రమేష్, వెంపాటి రాజు, ఇప్పర్ల సురేష్, కురుకూరి చౌదరి,పంచాయతీరాజ్ డిఇ ఉమా శంకర్, జే ఇనారాయణమూర్తి, మండల అభివృద్ధి అధికారి నాతి బుజ్జి, ఎమ్మార్వో, ఎస్సై శివ నాగబాబు, అధికారులు కూటమి నాయకులు పాల్గొన్నారు.

Tags:

Advertisement

Latest News

హఠాత్తుగా మూతపడిన జిందాల్ పరిశ్రమ..! ఆందోళన బాటలో కార్మికులు..!! హఠాత్తుగా మూతపడిన జిందాల్ పరిశ్రమ..! ఆందోళన బాటలో కార్మికులు..!!
విజయనగరం TPN : కొత్తవలస మండలంలోని అప్పన్నపాలెం దగ్గరున్న జిందాల్ స్టెయిన్ లెస్ స్టీల్ పరిశ్రమ దశాబ్దాలుగా నడుస్తూ వందలాది మంది కార్మికులకు జీవనోపాధిగా నిలిచింది. అయితే...
టీజీఎస్ఆర్టీసీ ఆస్పత్రిలో క్యాథ్ ల్యాబ్, 12 బెడ్ల ఎమ‌ర్జెన్సీ కేర్ యూనిట్..!
దోమల వ్యాప్తి నిర్మూలనలో డ్రైడే పద్ధతి ఉత్తమం :. డాక్టర్ జగన్‌మోహన్‌రావు
అంజన్‌కుమార్‌యాదవ్‌ వ్యాఖ్యలకు నిరసనగా బీజేపీ నేతల ధర్నా..!
మే 7 నుంచి ద్వారకా తిరుమలేశుని కల్యాణోత్సవాలు..!
కాచిగూడ రైల్వే మ్యూజియంలో ఘనంగా వరల్డ్ హెరిటేజ్ డే..!
హైదరాబాద్‌ సిటీలో అర్ధరాత్రి దొంగల హల్‌చల్‌..!