ఫేస్ యాప్ వల్ల అంగన్వాడీల వేతనాలు కోతకు వ్యతిరేకంగా ఆందోళన

By Ravi
On
ఫేస్ యాప్ వల్ల అంగన్వాడీల వేతనాలు కోతకు వ్యతిరేకంగా ఆందోళన

 

శ్రీకాకుళం: అంగన్వాడీ వర్కర్లకు ఫేస్ ఎన్‌రోల్‌మెంట్ విధానం ద్వారా వేతనాలు కోత విధించడం కొనసాగితే అంగన్వాడీ యూనియన్లు తీవ్ర నిరసన వ్యక్తం చేశాయి. ఫేస్ యాప్ పేరుతో ఆంగన్వాడీ వర్కర్లు, హెల్పర్స్‌ను పెడుతున్న ఒత్తిడి, సాంకేతిక సమస్యలు, పనిచేయని మొబైల్ ఫోన్లు, అలాగే మరొక వైపు మారుమూల ప్రాంతాల్లో సిగ్నల్ సమస్యల కారణంగా మరింత కష్టాలు పడుతున్నారన్నారు.

శ్రీకాకుళం జిల్లా ప్రధాన కార్యదర్శులు సి.హెచ్.అమ్మన్నాయుడు, పి.తేజేశ్వరరావు, ఎపి అంగన్వాడీ వర్కర్స్ & హెల్పర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షులు కె.కళ్యాణి, డి.సుధ ఈ విషయంపై మండిపడుతూ, ఈ నిర్ణయాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు.

ఇందులో ముఖ్యంగా, ఏడు నెలల నుండి మూడేళ్ల పిల్లల తల్లులకు ప్రతీ నెలా ఫొటోలను పోషణ్ ట్రాక్ యాప్‌లో అప్‌లోడ్ చేయాలని చెప్పడం అంగన్వాడీ వర్కర్లకు మరింత పని భారంగా మారుతుందని వారు పేర్కొన్నారు.

అంగన్వాడీ వర్కర్లు, వారి వేతనాలు కోత విధించడం, పనికి సంబంధించిన ఒత్తిడి పెంచడం సరికాదని తెలిపారు. వేతనాలు కోత విధించడాన్ని నిరసిస్తూ వారు పోరాటానికి సిద్ధమవుతున్నట్లు ప్రకటించారు.

ఈ కార్యక్రమంలో ఎపి అంగన్వాడీ వర్కర్స్ & హెల్పర్స్ యూనియన్ జిల్లా నాయకులు ఎన్. హైమావతి, వి. హేమలత, జె. కాంచన, డి. మోహిని, పి. బాలేశ్వరి, ఎల్. దుర్గ తదితరులు పాల్గొన్నారు.

Tags:

Advertisement

Latest News

కాచిగూడ రైల్వే మ్యూజియంలో ఘనంగా వరల్డ్ హెరిటేజ్ డే..! కాచిగూడ రైల్వే మ్యూజియంలో ఘనంగా వరల్డ్ హెరిటేజ్ డే..!
హైదరాబాద్‌ కాచిగూడ రైల్వే మ్యూజియంలో వరల్డ్‌ హెరిటేజ్‌ డేని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు, రైలు ప్రయాణికులు మరియు రైల్వే అభిమానులకు మ్యూజియంలోకి ఉచితంగా ప్రవేశం...
హైదరాబాద్‌ సిటీలో అర్ధరాత్రి దొంగల హల్‌చల్‌..!
కాంగ్రెస్‌పై కేంద్రమంత్రి బండి సంజయ్‌ ఫైర్‌..!
రుద్రారంలో తోషిబా కొత్త ఫ్యాక్టరీ..! రూ.562 కోట్ల పెట్టుబడులు..!
హైదరాబాద్‌లో ఏఐ డేటా సెంటర్ క్లస్టర్..! 
ఎంఎంటీఎస్‌ అత్యాచారయత్నం కేసు క్లోజ్‌..!
ఆ దేశంలో ఫస్ట్ ఏటీఎం.. స్పెషాలిటీ ఏంటంటే..