మత్స్యకారుల సమస్యల కోసం కేంద్ర మంత్రి సర్బానంద సోనోవాల్ని కలిసిన కేంద్ర మంత్రి రామ్మోహన నాయుడు.

By Ravi
On
 మత్స్యకారుల సమస్యల కోసం కేంద్ర మంత్రి  సర్బానంద సోనోవాల్ని కలిసిన కేంద్ర మంత్రి  రామ్మోహన నాయుడు.

శ్రీకాకుళం జిల్లా 11/10/25

శ్రీకాకుళంలో మత్స్యకారుల కోసం సముద్ర మౌలిక సదుపాయాల అవసరం గురించి గౌరవనీయులైన కేంద్ర పోర్ట్స్ , షిప్పింగ్ మరియు జలమార్గాల మంత్రి శ్రీ సర్బానంద సోనోవాల్ గారిని కలిసాము. సుమారు 150 కిలోమీటర్ల తీరప్రాంతం ఉన్నప్పటికీ, సరైన సౌకర్యాలు లేకపోవడం వల్ల ఈ ప్రాంతం నుండి చాలా మంది మత్స్యకారులు జీవనోపాధి కోసం పశ్చిమ తీరప్రాంత రాష్ట్రాలైన గుజరాత్, కేరళ మరియు కర్ణాటకకు వలస వెళ్ళవలసి పరిస్థితులను వివరించాము.

ఈ దీర్ఘకాలిక సమస్యను పరిష్కరించడం కోసం,  సంతబొమ్మలి మండలంలోని భావనపాడు గ్రామంలో ఒక ఫిషింగ్ హార్బర్‌ను నిర్మించాలని, వజ్రపుకోత్తూరు మండలంలోని మంచినీళ్లుపేట మరియు గారా మండలంలోని కళింగపట్నంలో ఫిషింగ్ జెట్టీలను నిర్మించాలని కోరాము.ఈ ప్రాజెక్టులు వల్ల స్థానిక ఉపాధి అవకాశాలను సృష్టించడంతో పాటు వలసలను తగ్గించడంలో మరియు తీరప్రాంత ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడంలో కీలక పాత్ర పోషిస్తాయి. సానుకూలంగా స్పందించిన శ్రీ సర్బానంద సోనోవాల్ గారికి నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.  అని ఒక ప్రకటనలో కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు తెలిపారు.

 

Tags:

Advertisement

Latest News

అనుకృష్ణ ఆస్పత్రికి రూ. 5లక్షల జరిమానా.. లైసెన్స్ రద్దు..! అనుకృష్ణ ఆస్పత్రికి రూ. 5లక్షల జరిమానా.. లైసెన్స్ రద్దు..!
మేడ్చల్ మల్కాజ్‌గిరి జిల్లాలోని అనుకృష్ణ హాస్పిటల్‌పై జిల్లా వైద్య ఆరోగ్యశాఖ, రెవెన్యూ, పోలీస్ అధికారులు దాడులు నిర్వహించారు. పీసీ, పీఎన్‌డీటీ సర్టిఫికెట్ రెన్యువల్ చేయించుకోకుండా పాత సర్టిఫికెట్‌తో...
ఘనంగా ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం జన్మదిన వేడుకలు..!
అక్రమంగా బాడీ బిల్డింగ్‌ స్టెరాయిడ్స్‌ విక్రయాలు
దేశవ్యాప్తంగా గ్యాస్ ధరల పెంపు..!
అడవి తల్లి బాటతో గిరిజన గ్రామాలకు మహర్ధశ
ఇషాంత్ శ‌ర్మ‌కు బీసీసీఐ ఫైన్.. కారణం ఏంటంటే?
బట్టతలపై జుట్టు మొలిపిస్తానంటూ మోసం