సురారంలో అమ్మ మాట -అంగన్వాడి బడిబాట ర్యాలీ
మేడ్చల్ జిల్లా: సూరారంలో అమ్మ మాట అంగన్వాడి బడిబాట అనే కార్యక్రమాన్ని మంత్రి సీతక్క ఈనెల 11వ తేదీన లాంఛనంగా ప్రారంభించారు. దాంట్లో భాగంగానే రోజువారి ప్రణాళికలో కుత్బుల్లాపూర్ ప్రాజెక్టులోని సూరారం అంగన్వాడీ కేంద్రంలో సిడిపిఓ రేణుక ఆధ్వర్యంలో అంగన్వాడీ టీచర్స్, హెల్పర్స్, సూపర్వైజర్లు, అందరూ కలిసి వివిధ కాలనీలలో బడిబాట కార్యక్రమాన్ని నిర్వహించడంజరిగింది. వివిధ కాలనీలలో ర్యాలీలో భాగంగా ప్రతి ఇంటింటికి తిరిగి అర్హులైన పిల్లలను అంగన్వాడీ కేంద్రానికి పంపించమని అడగడం జరిగింది. అర్హులైన పిల్లలను అంగన్వాడీ కేంద్రంలో నమోదు చేసుకున్నారు. కొత్తగా అంగన్వాడి కేంద్రంలో నమోదైన పిల్లలందరికీ అక్షరాభ్యాసం చేయించడం జరిగింది. ఈ విధంగా అంగన్వాడీ కేంద్రంలో అమ్మ మాట అంగన్వాడీ బడిబాట కార్యక్రమం ద్వారా అంగన్వాడి కేంద్రంలోని ఫ్రీ స్కూల్ విద్యార్థుల సంఖ్యను పెంచడానికి కృషి చేస్తున్నామని తెలిపారు. తద్వారా పిల్లలకు అంగన్వాడీ కేంద్రంలో ఆటపాటలతో పాటు, విద్యను మరియు పౌష్టికరమైన ఆహారాన్ని విద్యార్థులకు అందించడం జరుగుతుందని సిడిపిఓ అధికారి రేణుక తెలిపారు. కాలనీ పెద్దలు అంగన్వాడీ లెవల్ మానిటరింగ్ అండ్ సపోర్ట్ కమిటీ మెంబర్స్, వార్డ్ మెంబర్స్, విద్యార్థులు, విద్యార్థుల తల్లులతో కలిసి బడిబాట ర్యాలీలో పాల్గొన్నారు.