టెక్స్ టైల్స్ ఇండస్ట్రీ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా. కేంద్ర మంత్రి
ఎమ్ ఎస్ ఎమ్ ఇ ట్రేడర్స్, టెక్స్ టైల్స్ ఇండ్రస్ట్రీలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని కేంద్ర మంత్రి జితెన్ రామ్ మాంజీ అన్నారు. హైదరాబాద్ టూరిజం ప్లాజాలో తెలంగాణ ఫెడరేషన్ ఆఫ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ నిర్వహించిన సమావేశంతో కేంద్రమంత్రి జితెన్ రామ్ మాంజీ ముఖ్యఅతిధిగా పాల్గొన్నారు. ప్రధానంగా ఎంఎస్ ఎంఈ సెక్టార్ లో ట్రేడర్స్, టెక్స్ టైల్ ఇండస్ట్రీ ఎదుర్కొంటున్న సమస్యలను ఛాంబర్ ప్రతినిధులు కేంద్ర మంత్రికి వివరించారు. దీంతో పాటు ఫెడరేషన్ తరపున ఇంటరాక్షన్ సమావేశంలో ఎమ్ ఎస్ ఎమ్ ఈల తరహాలో ట్రేడర్స్ కి కూడా సబ్సీడి బ్యాంక్ రుణాలు ఇచ్చి ప్రోత్సహించాలని కేంద్రమంత్రిని ఛాంబర్ అధ్యక్షుడు ప్రకాష్, ప్రతినిధులు సతీష్ లు కోరారు. జీఎస్టీ స్లాబుల విషయంలో కూడా 5 శాతం చేయాలని కోరామన్నారు.. ఆన్ లైన్ ఫ్లాట్ ఫ్లామ్ ప్రభావం వల్ల మీడియం.. స్మాల్ ట్రేడర్స్ నష్టం జరుతుందని.. వారి కోసం ఓ పాలసీ రూపొందించాలని కోరుతున్నారు. చిన్న, సూక్ష్మ, మధ్య తరహా పరిశ్రమల అభివృద్దికి మరిన్ని సంస్కరణలు తీసుకురావాల్సిన అవరముందన్నారు. ఈ అంశాల పై కేంద్రమంత్రి సానుకూలంగా స్పందించినట్లు ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రతినిధులు పేర్కొన్నారు.