చెన్నై టీమ్ లోకి వచ్చిన 17 ఏళ్ల అయూష్ ఎవరంటే?

By Ravi
On
చెన్నై టీమ్ లోకి వచ్చిన 17 ఏళ్ల అయూష్ ఎవరంటే?

చెన్నై టీమ్ లో రుతురాజ్ గైక్వాడ్ కెప్టెన్. పైగా కీ ప్లేయర్ కూడా. రీసెంట్ గా రుతురాజ్ కు గాయం కావడంతో ఈసారి ఐపీఎల్ నుండి తప్పుకున్నారు. దీంతో కెప్టెన్ గా ధోనీ బాధ్యతలు తీసుకున్నారు. అలాగే రుతురాజ్ కు ప్రత్యామ్నాయంగా సీనియర్ బ్యాటర్ టీమ్ లోకి వస్తారని అనుకున్నారు. కానీ 17 ఏళ్ల అయూష్ మాత్రే చెన్నై టీమ్ లోకి రావడంతో అంతా సర్ ప్రైజ్ అయ్యారు. అయితే అతనిలో ఖచ్చితంగా ఏదో స్పెషాలిటీ ఉందనే విషయాన్ని గుర్తించారు. 2024 సీజన్ లో విజయ్ హజరే ట్రోఫీలో తను ముంబై తరఫున గేమ్ లోకి ఎంట్రీ ఇచ్చి.. ఓపెనర్ కర్ణాటకపై ఫస్ట్ మ్యాచ్ లోనే 78 పరుగులతో అందరి దృష్టిని ఆకట్టుకున్నాడు. 

తర్వాత నాగాలండ్ పై, సౌరాష్ట్రపై అత్యధిక పరుగులు చేశాడు. కాగా ఈ ఏడాది జనవరిలో మేఘాలయపై అయూష్‌ ఫస్ట్ రంజీ మ్యాచ్‌ ఆడాడు. రుతురాజ్‌ కు గాయం కావడంతో చెన్నై.. అయూష్‌కు ఛాన్స్ ఇచ్చింది. రూ.30 లక్షల కనీస ధరకు దక్కించుకుంది. మరోపక్క గాయపడిన లెగ్‌స్పిన్నర్‌ ఆడమ్‌ జంపా స్థానంలో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ రవిచంద్రన్‌ సమరన్‌ ను టీమ్ లోకి తీసుకుంది. కర్ణాటకకు చెందిన 21 ఏళ్ల రవిచంద్రన్‌ ఎడమచేతి వాటం బ్యాటర్‌. అతడిని రూ.30 లక్షల కనీస ధరకు సన్‌రైజర్స్‌ సొంతం చేసుకుంది.

Advertisement

Latest News

హఠాత్తుగా మూతపడిన జిందాల్ పరిశ్రమ..! ఆందోళన బాటలో కార్మికులు..!! హఠాత్తుగా మూతపడిన జిందాల్ పరిశ్రమ..! ఆందోళన బాటలో కార్మికులు..!!
విజయనగరం TPN : కొత్తవలస మండలంలోని అప్పన్నపాలెం దగ్గరున్న జిందాల్ స్టెయిన్ లెస్ స్టీల్ పరిశ్రమ దశాబ్దాలుగా నడుస్తూ వందలాది మంది కార్మికులకు జీవనోపాధిగా నిలిచింది. అయితే...
టీజీఎస్ఆర్టీసీ ఆస్పత్రిలో క్యాథ్ ల్యాబ్, 12 బెడ్ల ఎమ‌ర్జెన్సీ కేర్ యూనిట్..!
దోమల వ్యాప్తి నిర్మూలనలో డ్రైడే పద్ధతి ఉత్తమం :. డాక్టర్ జగన్‌మోహన్‌రావు
అంజన్‌కుమార్‌యాదవ్‌ వ్యాఖ్యలకు నిరసనగా బీజేపీ నేతల ధర్నా..!
మే 7 నుంచి ద్వారకా తిరుమలేశుని కల్యాణోత్సవాలు..!
కాచిగూడ రైల్వే మ్యూజియంలో ఘనంగా వరల్డ్ హెరిటేజ్ డే..!
హైదరాబాద్‌ సిటీలో అర్ధరాత్రి దొంగల హల్‌చల్‌..!