వాట్సాప్ హ్యాక్ అవ్వచ్చు.. కేంద్ర ప్రభుత్వం వార్నింగ్..

By Ravi
On
వాట్సాప్ హ్యాక్ అవ్వచ్చు.. కేంద్ర ప్రభుత్వం వార్నింగ్..

మెటా ఆధ్వర్యంలోని వాట్సాప్‌కు ప్రపంచవ్యాప్తంగా పెద్ద ఎత్తున యూజర్లు ఉన్నారు. భారత్‌ లోనూ కోట్లాది మంది వాట్సాప్‌ని వాడుతున్నారు. భారత వాట్సాప్‌ యూజర్లకు కేంద్ర ప్రభుత్వం వార్నింగ్ ఇచ్చింది. వాట్సాప్ వల్ల మొబైల్ హ్యాక్ అయ్యే ప్రమాదం ఉందని హెచ్చరించింది. ఎందుకంటే స్కామర్లు వాట్సాప్ లో బగ్ ని గుర్తించినట్లు తెలిపింది. CERT-In ప్రకారం.. వాట్సాప్ డెస్క్‌టాప్ వెర్షన్‌ను ఉపయోగిస్తున్న యూజర్లు సైతం డేంజర్‌లో ఉన్నారంటూ ఈ క్రమంలో వార్నింగ్ ఇచ్చింది. డెస్క్‌టాప్‌ కంప్యూటర్‌, ల్యాప్‌టాప్‌లో వాట్సాప్‌ను నడుపుతున్న యూజర్లు.. డెస్క్‌టాప్ వెర్షన్ 2.2450.6 కంటే పాత వెర్షన్‌ వాడుతున్నట్లయితే ఆయా యూజర్ల సిస్టమ్స్‌ హ్యాకర్ల దాడికి గురయ్యే ప్రమాదం ఉంది పేర్కొంది. 

కాగా హ్యాకర్స్‌ సిస్టమ్స్‌కి పంపే ప్రమాదకరమైన ఫైల్స్‌ సాధారణంగానే కనిపిస్తాయని.. ఆ ఫైల్స్‌ని ఓపెన్‌ చేస్తే వెంటనే వ్యక్తిగత డేటా చోరీకి గురయ్యే అవకాశం ఉంటుంది. అకౌంట్‌ హ్యాకింగ్‌ బారినపడే చాన్స్‌ ఉంటుందని చెప్పింది. వాట్సాప్‌ డెస్క్‌టాప్‌ని ఉపయోగించే వారంతా అప్లికేషన్‌ని అప్‌డేట్‌ చేసుకోవాలని సూచించింది. ఏవైనా గుర్తు తెలియని లింక్స్‌ని క్లిక్‌ చేయడం మానుకోవాలని, తెలియని నంబర్ల నుంచి వచ్చే సందేశాలకు రిప్లే ఇవ్వొద్దని.. ప్రతి అప్‌డేట్‌తో వెంటనే వాట్సాప్‌ అప్లికేషన్‌ కొత్త వెర్షన్‌ని ఇన్‌స్టాల్‌ చేయాలని తెలిపింది.

Advertisement

Latest News

హఠాత్తుగా మూతపడిన జిందాల్ పరిశ్రమ..! ఆందోళన బాటలో కార్మికులు..!! హఠాత్తుగా మూతపడిన జిందాల్ పరిశ్రమ..! ఆందోళన బాటలో కార్మికులు..!!
విజయనగరం TPN : కొత్తవలస మండలంలోని అప్పన్నపాలెం దగ్గరున్న జిందాల్ స్టెయిన్ లెస్ స్టీల్ పరిశ్రమ దశాబ్దాలుగా నడుస్తూ వందలాది మంది కార్మికులకు జీవనోపాధిగా నిలిచింది. అయితే...
టీజీఎస్ఆర్టీసీ ఆస్పత్రిలో క్యాథ్ ల్యాబ్, 12 బెడ్ల ఎమ‌ర్జెన్సీ కేర్ యూనిట్..!
దోమల వ్యాప్తి నిర్మూలనలో డ్రైడే పద్ధతి ఉత్తమం :. డాక్టర్ జగన్‌మోహన్‌రావు
అంజన్‌కుమార్‌యాదవ్‌ వ్యాఖ్యలకు నిరసనగా బీజేపీ నేతల ధర్నా..!
మే 7 నుంచి ద్వారకా తిరుమలేశుని కల్యాణోత్సవాలు..!
కాచిగూడ రైల్వే మ్యూజియంలో ఘనంగా వరల్డ్ హెరిటేజ్ డే..!
హైదరాబాద్‌ సిటీలో అర్ధరాత్రి దొంగల హల్‌చల్‌..!