వక్ఫ్‌ చట్టంపై మోడీ సెన్సేషనల్ కామెంట్స్..

By Ravi
On
వక్ఫ్‌ చట్టంపై మోడీ సెన్సేషనల్ కామెంట్స్..

ప్రస్తుతం దేశవ్యాప్తంగా వక్ఫ్ చట్టం మార్మోగుతుంది. హర్యానా హిస్సార్ లో నిర్వహించిన సభలో ప్రధాని నరేంద్ర మోదీ కాంగ్రెస్ పార్టీపై విరుచుకుపడ్డారు. కాంగ్రెస్ వక్ఫ్ బోర్డ్ చట్టాల్ని మార్చిందని అన్నారు. ఓటు బ్యాంక్ రాజకీయాలను అడ్డం పెట్టుకుని వక్ఫ్ బోర్డ్ రూల్స్ ని కాంగ్రెస్ మార్చిందని అన్నారు. కాంగ్రెస్ కి ఓటు బ్యాంక్ వైరస్ పట్టుకుందని కామెంట్ చేశారు. ఎస్సీ, ఎస్టీకు వ్యతిరేకండా ఆ పార్టీ పనిచేస్తుందన్నారు. వక్ఫ్ బోర్డ్ పేరుతో కాంగ్రెస్ భూముల్ని దోచుకుందన్నారు. కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీకు వ్యతిరేకండా ఆ పార్టీ పనిచేస్తుందని ఆరోపించారు. అయితే ఈ చట్టం వల్ల ముస్లింలకు ఎలాంటి ప్రయోజనం లేదన్నారు. కాంగ్రెస్ మాత్రమే ఈ చట్టం పేరుతో రాజకీయం చేస్తుందన్నారు. వక్ఫ బోర్డు పేరుతో లక్షల హెక్టార్ల భూమిని కొల్లగొట్టారని, వక్ఫ్ బోర్డు పేరుతో పేదలు, ఆదివాసుల భూముల్ని లాక్కున్నారని మోడీ అన్నారు. 

పేద ముస్లిం మహిళలు, వితంతు మహిళలు కేంద్ర ప్రభుత్వాన్ని వక్ఫ్ బోర్డుపై లేఖలు రాశారని అన్నారు. అంబేద్కర్ రాజ్యాంగాన్ని కాంగ్రెస్ అవమానించిందని ఆరోపించారు. కాంగ్రెస్ రాజ్యాంగం కన్నా వక్ఫ్‌నే పెద్దదిగా చేసిందని అన్నారు. 2014కు ముందు దేశంలో 74 ఎయిర్‌పోర్టులు ఉంటే, ఈ రోజు 150 ఎయిర్‌పోర్ట్ లు ఉన్నాయని మోడీ అన్నారు. కాంగ్రెస్ 70 ఏళ్ల పాలనలో 74 ఎయిర్ పోర్టులు మాత్రమే నిర్మించిందని నరేంద్ర మోదీ పేర్కోన్నారు.

Advertisement

Latest News

హఠాత్తుగా మూతపడిన జిందాల్ పరిశ్రమ..! ఆందోళన బాటలో కార్మికులు..!! హఠాత్తుగా మూతపడిన జిందాల్ పరిశ్రమ..! ఆందోళన బాటలో కార్మికులు..!!
విజయనగరం TPN : కొత్తవలస మండలంలోని అప్పన్నపాలెం దగ్గరున్న జిందాల్ స్టెయిన్ లెస్ స్టీల్ పరిశ్రమ దశాబ్దాలుగా నడుస్తూ వందలాది మంది కార్మికులకు జీవనోపాధిగా నిలిచింది. అయితే...
టీజీఎస్ఆర్టీసీ ఆస్పత్రిలో క్యాథ్ ల్యాబ్, 12 బెడ్ల ఎమ‌ర్జెన్సీ కేర్ యూనిట్..!
దోమల వ్యాప్తి నిర్మూలనలో డ్రైడే పద్ధతి ఉత్తమం :. డాక్టర్ జగన్‌మోహన్‌రావు
అంజన్‌కుమార్‌యాదవ్‌ వ్యాఖ్యలకు నిరసనగా బీజేపీ నేతల ధర్నా..!
మే 7 నుంచి ద్వారకా తిరుమలేశుని కల్యాణోత్సవాలు..!
కాచిగూడ రైల్వే మ్యూజియంలో ఘనంగా వరల్డ్ హెరిటేజ్ డే..!
హైదరాబాద్‌ సిటీలో అర్ధరాత్రి దొంగల హల్‌చల్‌..!