మంత్రికి తమ సమస్యలు చెప్పుకున్న ప్రవీణ్ కుమార్ రెడ్డి.

By Ravi
On
మంత్రికి తమ సమస్యలు చెప్పుకున్న ప్రవీణ్ కుమార్ రెడ్డి.

తిరుపతి లో మంగళవారం కలెక్టర్ ఆఫీస్ నందు, ఆంధ్రప్రదేశ్ మంత్రివర్యులు, తిరుపతి జిల్లా ఇన్చార్జ్  అనగాని సత్యప్రసాద్ ను, సత్యవేడు నియోజకవర్గ టిడిపి మండల అధ్యక్షులు కుప్పాని ప్రవీణ్ కుమార్ రెడ్డి, సత్యవేడు నియోజకవర్గం కోఆర్డినేటర్ శ్రీపతి బాబు,  టీడీపీ నాయకుల మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది. తమిళనాడుకి సరిహద్దు ప్రాంతముగా, ఆంధ్రప్రదేశ్ వెనుకబడిన ప్రాంతం కావడంతో, అన్ని విధాలుగా ప్రభుత్వం వారు నియోజకవర్గాన్ని ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. అదేవిధంగా ఇసుక ఇబ్బంది ఉండటంతో ప్రభుత్వం వారు చర్యలు చేపట్టి అధికారుల తీసుకోవాలని కోరారు. నాగలాపురంలో భవన నిర్మాణ సమస్యలు ఉండటంతో వెంటనే పరిష్కారం చేయాలని మంత్రిని కోరారు. ఊతుకోట - చెన్నై రోడ్లు సరిగ్గా లేవని వాహనదారులు వెళ్లాలంటే ఇబ్బంది పడుతున్నారని మంత్రికి  వారు తెలిపారు. మంత్రి సత్య ప్రసాద్ మాట్లాడుతూ  అధిష్టానంకి  వివరించి సమస్యలు పరిష్కారం చేస్తామని తెలిపారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వెనుకబడిన ప్రాంతాలను గుర్తించి వెంటనే ఆ నియోజకవర్గాలపై అభివృద్ధి బాట వేస్తుందని, సత్యవేడు నియోజకవర్గం కూడా రానున్న రోజుల్లో పలు అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతాయని మంత్రి సత్యప్రసాద్, టిడిపి నాయకులకు తెలిపారు. ఈ కార్యక్రమంలో సత్యవేడు నియోజకవర్గానికి చెందిన మరి కొంతమంది టిడిపి నాయకులు పాల్గొన్నారు.

Advertisement

Latest News

హఠాత్తుగా మూతపడిన జిందాల్ పరిశ్రమ..! ఆందోళన బాటలో కార్మికులు..!! హఠాత్తుగా మూతపడిన జిందాల్ పరిశ్రమ..! ఆందోళన బాటలో కార్మికులు..!!
విజయనగరం TPN : కొత్తవలస మండలంలోని అప్పన్నపాలెం దగ్గరున్న జిందాల్ స్టెయిన్ లెస్ స్టీల్ పరిశ్రమ దశాబ్దాలుగా నడుస్తూ వందలాది మంది కార్మికులకు జీవనోపాధిగా నిలిచింది. అయితే...
టీజీఎస్ఆర్టీసీ ఆస్పత్రిలో క్యాథ్ ల్యాబ్, 12 బెడ్ల ఎమ‌ర్జెన్సీ కేర్ యూనిట్..!
దోమల వ్యాప్తి నిర్మూలనలో డ్రైడే పద్ధతి ఉత్తమం :. డాక్టర్ జగన్‌మోహన్‌రావు
అంజన్‌కుమార్‌యాదవ్‌ వ్యాఖ్యలకు నిరసనగా బీజేపీ నేతల ధర్నా..!
మే 7 నుంచి ద్వారకా తిరుమలేశుని కల్యాణోత్సవాలు..!
కాచిగూడ రైల్వే మ్యూజియంలో ఘనంగా వరల్డ్ హెరిటేజ్ డే..!
హైదరాబాద్‌ సిటీలో అర్ధరాత్రి దొంగల హల్‌చల్‌..!