మాజీ మంత్రి పెద్దిరెడ్డి ని కలిసిన వైసిపి నాయకులు..

By Ravi
On
మాజీ మంత్రి పెద్దిరెడ్డి ని కలిసిన వైసిపి నాయకులు..

ఉమ్మడి చిత్తూరు జిల్లా క్రియశీల కార్యదర్శి టి రాకేశ్ కిరణ్, రిటైర్డ్  జిల్లా జడ్జి దొరస్వామి, తిరుపతిలోని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని అయన  నివాసంలో మర్యాదపూర్వకంగా మంగళవారం కలిశారు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చేతికి దెబ్బ తగలడంతో వారిని కలిసి, ఆరోగ్య వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో సత్యవేడు కు చెందిన మరి కొంతమంది వైఎస్ఆర్సిపి నాయకులు పాల్గొన్నారు. వారు  మాట్లాడుతూ కూటమి  ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత హామీలను అమలు చేస్తామని చెప్పిందని, కానీ మండలాలలో పేదవారికి అందడం లేదని వారు అన్నారు. సత్యవేడు నియోజకవర్గంలో వెనుకబడిన ప్రాంతం కాబట్టి, అన్ని విధాలుగా వైఎస్సార్సీపీ పార్టీని బలోపేతం చేసి రానున్న రోజుల్లో పార్టీ సభ్యత్వాలు బారీగా  నమోదు చేయాలని అన్నారు. ఎక్కడ చూసినా కూడా వైసిపి నాయకులకు చేదు అనుభవం తగులుతుందని, పార్టీలు చూడకుండా పేదవారిని అన్ని విధాలుగా ఆదుకోవాలని వారు మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి వివరించారు.

Advertisement

Latest News

హఠాత్తుగా మూతపడిన జిందాల్ పరిశ్రమ..! ఆందోళన బాటలో కార్మికులు..!! హఠాత్తుగా మూతపడిన జిందాల్ పరిశ్రమ..! ఆందోళన బాటలో కార్మికులు..!!
విజయనగరం TPN : కొత్తవలస మండలంలోని అప్పన్నపాలెం దగ్గరున్న జిందాల్ స్టెయిన్ లెస్ స్టీల్ పరిశ్రమ దశాబ్దాలుగా నడుస్తూ వందలాది మంది కార్మికులకు జీవనోపాధిగా నిలిచింది. అయితే...
టీజీఎస్ఆర్టీసీ ఆస్పత్రిలో క్యాథ్ ల్యాబ్, 12 బెడ్ల ఎమ‌ర్జెన్సీ కేర్ యూనిట్..!
దోమల వ్యాప్తి నిర్మూలనలో డ్రైడే పద్ధతి ఉత్తమం :. డాక్టర్ జగన్‌మోహన్‌రావు
అంజన్‌కుమార్‌యాదవ్‌ వ్యాఖ్యలకు నిరసనగా బీజేపీ నేతల ధర్నా..!
మే 7 నుంచి ద్వారకా తిరుమలేశుని కల్యాణోత్సవాలు..!
కాచిగూడ రైల్వే మ్యూజియంలో ఘనంగా వరల్డ్ హెరిటేజ్ డే..!
హైదరాబాద్‌ సిటీలో అర్ధరాత్రి దొంగల హల్‌చల్‌..!