ఫలక్నుమా ఎక్స్ప్రెస్కు తప్పిన పెనుప్రమాదం..!
By Ravi
On
సికింద్రాబాద్ నుంచి హౌరా వెళుతున్న ఫలక్నుమా ఎక్స్ప్రెస్ రైలుకు పెద్ద ప్రమాదం తప్పింది. రైలు పలాస రైల్వేస్టేషన్ దాటిన వెంటనే సుమ్మదేవి రైల్వేస్టేషన్ సమీపంలో బోగీల మధ్య ఉన్న కప్లింగ్ విరిగిపోయింది. దీంతో ఇంజిన్తోపాటు 8 భోగీలు రైల్వేస్టేషన్కు చేరుకోగా.. మిగిలిన 15 బోగీలు సుమ్మాదేవి రైల్వేస్టేషన్ సమీపంలోనే నిలిచిపోయాయి. దీంతో అప్రమత్తమైన రైల్వే ఉద్యోగులు ఫలక్నుమా ఎక్స్ప్రెస్ను మందస రోడ్డు దగ్గర నిలిపివేశారు. మరో ఇంజన్ సహాయంతో భోగీలను మందస రోడ్డుకు తీసుకొచ్చి విడిపోయిన వాటితో కలిపారు. దీంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు.
Related Posts
Latest News
18 Apr 2025 21:42:20
విజయనగరం TPN : కొత్తవలస మండలంలోని అప్పన్నపాలెం దగ్గరున్న జిందాల్ స్టెయిన్ లెస్ స్టీల్ పరిశ్రమ దశాబ్దాలుగా నడుస్తూ వందలాది మంది కార్మికులకు జీవనోపాధిగా నిలిచింది. అయితే...