భూమి కోసం కారుతో ఢీకొట్టి హత్య

By Ravi
On
భూమి కోసం కారుతో ఢీకొట్టి హత్య

పూర్వీకుల భూమి స్వాధీనం చేసునేందుకు ఓ వ్యక్తిని కక్షపూరితంగా కారుతో ఢీకొట్టి హత్య చేసిన సంఘటన మహేశ్వరం మండలంలో తీవ్ర కలకలం రేపింది. ఈ కేసుకు సంబంధించిన వివరాలను పోలీసులు వెల్లడించారు. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం కల్వకోల్ గ్రామానికి చెందిన గూడెపు శంకరయ్యకు, గూడెపు నర్సింగరావు, బక్కని కార్తీక్, గూడెపు కుమార్, గూడెపు శ్రీనివాస్‌కు మధ్య పూర్వీకుల కాలంనాటి భూమికి సంబంధించిన వివాదం నడుస్తోంది. ఈ భూమికి సంబంధించిన వివాదం కోర్టులో పెండింగ్‌లో ఉంది. అయితే తాజాగా గూడెపు శంకరయ్య అదే భూమిపై తనకు అనుకూలంగా ఇంజక్షన్ ఆర్డర్ పొందాడు. భూమిలోకి ప్రవేశించేందుకు ప్రయత్నం చేశాడు. దీంతో శంకరయ్యపై గూడెపు నర్సింగరావు, బక్కని కార్తీక్, గూడెపు కుమార్, గూడెపు శ్రీనివాస్ ద్వేషం పెంచుకున్నారు.‌ శంకరయ్యను ఎలాగైనా హత్య చేసి భూమిని స్వాధీనం చేసుకోవాలని పన్నాగం పన్నారు. నర్సింగరావు శంకరయ్యను హత్య చేసేందుకు ప్రశాంత్‌ని నియమించాడు. శంకరయ్య కదలికలను గమనించే పనిని కార్తీక్‌కు అప్పగించాడు. శంకరయ్యను హత్య చేసేందుకు ఓ కారును అద్దెకు తీసుకున్నారు. ఈనెల రెండో తేదీ మధ్యాహ్నం 3:30 గంటలకు కల్వకోల్ ఎక్స్ రోడ్ దగ్గర తన బైక్‌పై వస్తున్న శంకరయ్యను ప్రశాంత్ కారుతో ఢీకొట్టి హత్య చేశాడు. అనంతరం శంకరయ్యను హత్య చేసిన విషయాన్ని వాట్సప్ ద్వారా నర్సింగరావుకు తెలియజేశాడు. అయితే ముందుగా శంకరయ్య యాక్సిడెంట్‌లో చనిపోయాడని భావించిన పోలీసులకు.. ఈ కేసులో కొత్తకోణం వెలుగులోకి వచ్చింది. దీంతో పోలీసులు సీసీ ఫుటేజీ, ఆధారాలను సేకరించి విచారణ చేయడంతో.. ఇది యాక్సిడెంట్ కాదని కావాలనే శంకరయ్యను హత్య చేశారని తేల్చేశారు. ఐదుగురు నిందితులను అదుపులోకి తీసుకొని.. వారి నుంచి 2 కార్లు, మోటార్ సైకిల్‌తోపాటు  3 సెల్‌ఫోన్స్‌ను స్వాధీనం చేసుకుని రిమాండ్‌కి తరలించారు.

Advertisement

Latest News

హఠాత్తుగా మూతపడిన జిందాల్ పరిశ్రమ..! ఆందోళన బాటలో కార్మికులు..!! హఠాత్తుగా మూతపడిన జిందాల్ పరిశ్రమ..! ఆందోళన బాటలో కార్మికులు..!!
విజయనగరం TPN : కొత్తవలస మండలంలోని అప్పన్నపాలెం దగ్గరున్న జిందాల్ స్టెయిన్ లెస్ స్టీల్ పరిశ్రమ దశాబ్దాలుగా నడుస్తూ వందలాది మంది కార్మికులకు జీవనోపాధిగా నిలిచింది. అయితే...
టీజీఎస్ఆర్టీసీ ఆస్పత్రిలో క్యాథ్ ల్యాబ్, 12 బెడ్ల ఎమ‌ర్జెన్సీ కేర్ యూనిట్..!
దోమల వ్యాప్తి నిర్మూలనలో డ్రైడే పద్ధతి ఉత్తమం :. డాక్టర్ జగన్‌మోహన్‌రావు
అంజన్‌కుమార్‌యాదవ్‌ వ్యాఖ్యలకు నిరసనగా బీజేపీ నేతల ధర్నా..!
మే 7 నుంచి ద్వారకా తిరుమలేశుని కల్యాణోత్సవాలు..!
కాచిగూడ రైల్వే మ్యూజియంలో ఘనంగా వరల్డ్ హెరిటేజ్ డే..!
హైదరాబాద్‌ సిటీలో అర్ధరాత్రి దొంగల హల్‌చల్‌..!