ప్ర‌జాద‌ర్బార్‌కు విన‌తుల వెల్లువ‌..!

By Ravi
On
ప్ర‌జాద‌ర్బార్‌కు విన‌తుల వెల్లువ‌..!

శ్రీ‌కాకుళం నియోజ‌క‌వ‌ర్గ‌ ప్రజల కోసం ఎమ్మెల్యే గొండు శంక‌ర్‌ నిర్వహిస్తున్న ప్రజాదర్బార్‌కు ప్ర‌జ‌ల నుంచి అనూహ్య స్పందన లభిస్తోంది. నియోజకవర్గం నలుమూలల నుంచి వివిధ వర్గాల ప్రజలు టీడీపీ కార్యాల‌యానికి చేరుకుని యువనేతకు తమ సమస్యలు  విన్నవించుకుంటున్నారు. ఉదయం 7 గంటల సమయానికి దాదాపు వంద మంది వినతి పత్రాలతో బారులు తీరుతున్నారు. నియోజ‌క‌వ‌ర్గ‌ ప్రజలను తమ కుటుంబ సభ్యులుగా భావించే ఎమ్మెల్యే శంక‌ర్‌.. ప్రతి ఒక్కరి సమస్యను చిత్తశుద్ధితో వింటూ తానున్నానని భరోసా ఇస్తున్నారు. నియోజకవర్గానికి చెందిన పలువురు ప్రజలు తమ సమస్యలపై యువనేతను కలిసి తాము ఎదుర్కొంటున్న కష్టాలు తీర్చాలని విజ్ఞప్తి చేశారు. అంగన్‌వాడీలు, ఉపాధ్యాయులు తాము ఎదుర్కొంటున్న సమస్యలను యువనేత దృష్టికి తీసుకువచ్చారు. జీతాలు పెంచాలని అంగన్‌వాడీ టీచర్లు, ఉపాధి, ఉద్యోగాలు కల్పించాలని నిరుద్యోగుల నుంచి వినతులు అందాయి. విద్య, వైద్య ఖర్చులకు సాయం అందించాలని పలువురు కోరారు. వైసీపీ నేతలు అధికారాన్ని అడ్డుపెట్టుకుని తమ భూములను బలవంతంగా లాక్కున్నారని, తమకు న్యాయం చేయాలని యువనేతకు పెద్ద ఎత్తున ఫిర్యాదులు అందాయి. అందరి సమస్యలను ఓపిగ్గా విన్న ఎమ్మెల్యే సాధ్యమైనంత త్వరగా పరిష్కారం చూపుతామని భరోసా ఇవ్వడంతో ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

Latest News

హఠాత్తుగా మూతపడిన జిందాల్ పరిశ్రమ..! ఆందోళన బాటలో కార్మికులు..!! హఠాత్తుగా మూతపడిన జిందాల్ పరిశ్రమ..! ఆందోళన బాటలో కార్మికులు..!!
విజయనగరం TPN : కొత్తవలస మండలంలోని అప్పన్నపాలెం దగ్గరున్న జిందాల్ స్టెయిన్ లెస్ స్టీల్ పరిశ్రమ దశాబ్దాలుగా నడుస్తూ వందలాది మంది కార్మికులకు జీవనోపాధిగా నిలిచింది. అయితే...
టీజీఎస్ఆర్టీసీ ఆస్పత్రిలో క్యాథ్ ల్యాబ్, 12 బెడ్ల ఎమ‌ర్జెన్సీ కేర్ యూనిట్..!
దోమల వ్యాప్తి నిర్మూలనలో డ్రైడే పద్ధతి ఉత్తమం :. డాక్టర్ జగన్‌మోహన్‌రావు
అంజన్‌కుమార్‌యాదవ్‌ వ్యాఖ్యలకు నిరసనగా బీజేపీ నేతల ధర్నా..!
మే 7 నుంచి ద్వారకా తిరుమలేశుని కల్యాణోత్సవాలు..!
కాచిగూడ రైల్వే మ్యూజియంలో ఘనంగా వరల్డ్ హెరిటేజ్ డే..!
హైదరాబాద్‌ సిటీలో అర్ధరాత్రి దొంగల హల్‌చల్‌..!