ఆ ఎమ్మెల్యే వ్యాఖ్యలపై మాజీ సీఎం జగన్ ఫైర్..! తీరు మారదా? అంటూ ట్వీట్!

By Dev
On
ఆ ఎమ్మెల్యే వ్యాఖ్యలపై మాజీ సీఎం జగన్ ఫైర్..! తీరు మారదా? అంటూ ట్వీట్!

 ఏడాది కాలంగా అనేక మంది వైఎస్ఆర్‌సీపీ మహిళా నాయకులను  దారుణంగా వేధిస్తూ  అవమానించడం తగదన్నారు. తనపై ఒక ఎమ్మెల్యే చేసిన అత్యంత హేయమైన వ్యాఖ్యలపై ఫిర్యాదు చేయడానికి ఆర్‌కె రోజా వెళ్లగా, వాస్తవాలు స్పష్టంగా కళ్లెదుటే కనిపిస్తున్నా పోలీసులు తిరిగి ఆమెపైనే సందేహాలు వ్యక్తం చేయడం ఏంటని ప్రశ్నించారు. ఇది రాష్ట్రంలో పోలీసు వ్యవస్థ ఎంత దారుణంగా మారింది? టీడీపీ నేతలను రక్షించేందుకు వారు ఏ స్థాయిలో తమ బాధ్యత, కర్తవ్యాన్ని మరచి వ్యవహరిస్తున్నారో ఈ ఘటనలు తెలియజేస్తున్నాయని జగన్ అన్నారు. మాజీ మంత్రి విడదల రజని, కృష్ణా జిల్లా జడ్పీ ఛైర్‌పర్సన్‌ ఉప్పాల హారికతో పాటు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన  నాయకుల కుటుంబ సభ్యుల విషయంలో కూడా చాలా అవమానకర ఘటనలు చోటు చేసుకున్నయని గుర్తు చేశారు.

ఇకనైనా మాజీ మంత్రి ఆర్‌కె రోజాను దారుణంగా అవమానించిన ఎమ్మెల్యే భానుప్రకాష్‌ను తక్షణమే అరెస్టు చేసి, చట్టపరమైన చర్యలు తీసుకోవాలని మాజీ సీఎం జగన్ ఎక్స్ వేదికగా కోరారు.

Advertisement

Latest News